Humanity

Humanity

Tuesday, June 16, 2015

వివేక్ - నక్సలిజం


వివేక్ 19 ఏళ్ళ కుర్రాడు ఎన్కౌంటర్ లో చనిపోయిన దగ్గరనుండి అనుకూలంగా, వ్యతిరేకంగా చాలా మంది పోస్ట్లు వస్తూనే వున్నాయ్. వీటన్నిటిని చూసిన తర్వాత రాయాలి అనిపించి రాస్తున్నా.
వివేక్ నిజంగా ఒక పోరాట యోధుడు. అందులో సందేహం లేదు. తాను నమ్మిన సిద్దాంతం కోసం ప్రాణాలైనా అర్పించే తత్వం ఉన్న గొప్పవ్యక్తి. డబ్బుకోసం ఏ ఎండకి ఆ గోడుగు పట్టే నేటి ఆధునిక సమాజంలో పుట్టి ఇతరులకోసం ప్రాణాలను సైతం లెక్క చేయని త్యాగ జీవి. అదే సందర్భంలో ఎంతో మందిని రిక్రూట్ చేసుకుంటున్నా ఈ వివేక్ మాత్రమె ఎలా పోలీసులకి దొరికి ఎన్కౌంటర్ లో చనిపోయాడు అనే విషయంలో అతని కేడెర్ యొక్క అసమర్ధత కనిపిస్తుంది. ఇది కావాలనే ఎవరో చేసిన పనిగా అనుమానించాల్సి వస్తుంది. ఇన్నాళ్ళుగా ఇన్ని కుమ్బింగ్స్ లో దొరకని ఎంతోమంది వున్నారు. కాని ఇతను మాత్రం ఒక్కడే ఎలా దొరికాడు. నిజాలు నిదానంగా తెలుస్తాయి.

తుపాకి ఎందుకు పట్టాలి? 

ఒక వ్యక్తీ మనల్ని రాయితో కొడుతుంటే మనం రాయితో కొడతాం, కర్రపట్టుకొని వస్తే మనం కూడా కర్రపట్టుకుంటాం అలాగే తుపాకి పట్టుకొని వస్తే తుపాకి పట్టుకోవాలి. తప్పదు. ఎందుకంటె ఇది బతుకు పోరాటం. అహింసా సిద్దాంతం అన్నివేళలా పనిచేయదు. అహింసా సిద్దాంతం గాంధీగారు చేయడానికి అప్పటి రాజకీయ పరిస్తితులు అనుకూలించాయి. ప్రపంచంలో బ్రిటిషర్స్ కి రాజకీయంగా వ్యతిరేకత కలిగే అవకాసం వుంటుంది. అంతర్జాతీయ పరిస్తితులు అనుకూలించాయి. అందుకే అహింస అని తల వంచినా ఏమీ చేయలేకపోయారు బ్రిటిషర్స్. కాని స్వాతంత్ర్యం వచ్చాక మనదేశ అంతర్గత పరిస్తితులు అలా లేవు. నాటి భూస్వాములు లేదా నవాబులు పరిపాలన అత్యంత దౌర్జన్యంగా, అరాచకంగా వుండేది. అహింసా అంటే హింసని చూపించే పరిస్తితి. విసిగి వేసారిన ప్రజలు తిరగబడ్డారు. భూస్వామ్య వ్యవస్త మీద అతి సాధారణ ప్రజలు తుపాకి పట్టి తెలంగాణా సాయుధ పోరాటం ద్వారా భూస్వామ్య వ్యవస్థ మీద పోరాడి ఆ వ్యవస్తనే లేకుండా చేయగలిగారు. ఆ స్పూర్తి ప్రజలలో ఇప్పటికీ చాటుకుంటూనే వున్నారు. తెలంగాణా అనే పదం సాయుధపోరాటం ద్వారా చిరకాలం ఈ ప్రపంచానికే గుర్తుండి పోతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆ సాయుధపోరాట స్పూర్తి తెలంగాణాని విడిగానే చూసింది. నేటికి అది తన అస్తిత్వాన్ని నిలబెట్టుకొని ఒక రాష్ట్రంగా ఏర్పడింది.
అహింసా సిద్దాంతం మంచిదే అయితే పాకిస్తాన్ సైనికులముందు మనవాళ్ళని తుపాకి లేకుండా పంపగాలమా. హింసని కోరుకొనే వాళ్ళతో అహింస ద్వారా విజయం సాధించలేం. ఇలా అహింసా అనాలి అంటే శత్రువు కూడా మంచివాడై వుండాలి. కాని ఇక్కడి వ్యవస్త మంచిదేనా. ఎన్నో ఏళ్ళుగా తమ తమ ప్రాంతాల్లో హాయిగా జీవనం సాగిస్తున్న ప్రజలను ఏదోఒక ఖనిజం పేరుతోనో, భూమికోసమో, ప్రాజెక్ట్ కోసమో తమ భూభాగాన్ని వదిలి పొమ్మని తుపాకి పట్టుకొని బెదిరిస్తుంటే, చంపుతుంటే ఎవరైనా ఏంచేస్తారు. తల వంచుకొని ఎంతదూరం పోతారు. కనీసం ఉపాది అవకాశాలు చూపకుండా పునరావాసం చూపించకుండా రాజ్యం చేస్తున్న హింస ఇక్కడ ఎవడికి కనబడుతుంది. ఎవడు రాస్తాడు పేపర్లలో. ఎవడు వేస్తాడు టీవీల్లో. ఎవడు ఆడ్స్ ఇచ్ఛి డబ్బులిస్తే వాడి డబ్బా కొట్టడం తప్ప. తుపాకితో పనిలేకుండా పనిజరుగుతుంటే తుపాకి ఎందుకు పడతారు. నిజంగా ప్రజల శ్రేయస్సుకోసం కాదా ఈ ప్రభుత్వాలు వున్నది. మరి అలాంటప్పుడు ఎందుకు ప్రజల శ్రేయస్సు కోరే వాళ్ళని తుపాకి పట్టుకోనేదాకా తీసుకెళ్లడం. ఇది రాజ్యం, ప్రభుత్వాల వైఫల్యం.
ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు జరుగుతున్న చర్చ మరొక ఎత్తు. నాయకుల పిల్లలని ఎందుకు బలివ్వరు అని. వాళ్ళ పిల్లలని మాత్రం విదేశాల్లో చదివిస్తున్నారు అని ఇలా రకరకాల చర్చలు వస్తున్నాయ్. ఇందులో నిజాలు లేకపోలేదు. కాని పూర్తిగా ఇక్కడి రాజకీయ వ్యవస్తలో బ్రస్తుపట్టిపోయిన ప్రజలు ఇది మాట్లాడడం విడ్డూరం. వీళ్ళకి కనీస అర్హత కూడా లేదు.
ఏదేమైనా నాటి నక్సలిజం వేరు నేటి ఇజం వేరు. ఆరోజుల్లో ప్రజల్లో సానుభూతి మెండుగా వుండేది. నేడు అది లేదు. పూర్తిగా తగ్గిపోయింది. కేవలం ఆ సానుభూతి కొన్ని చిట్ట చివరి పీడిత ప్రజలలోనే కనిపిస్తుంది. దానికి కారణం కూడా నక్సల్స్ అవలంబిస్తున్న విధానాలే.
రాజులు సైన్యాన్ని ముందుపెట్టి యుద్ధం చేసినట్టు నేడు పాలకులు కూడా పోలీసులని ముందుపెట్టి వాళ్ళని బలిచేస్తున్నారు. ఇది వ్యవస్తలో తప్పుకాకపోయిన నక్సల్స్ మాత్రం ఆ సైన్యం వెనకపడుతూ ప్రజలను హింసిస్తున్న పాలకులని మాత్రం వదిలేస్తూ ప్రజల్లో సానుభూతిని కోల్పోతున్నారు. 20 ఏళ్ళ క్రితం ఏ నాయకుడు తప్పు చేయాలన్నా అన్నలు వున్నారు చంపేస్తారు అనే భయం వుండేది. కాని నేడు అది లేదు పైగా వాళ్ళతోనే లాలూచి పడే స్తాయికి దిగజారి పోయి తమ సిద్దాంతాన్ని వదిలేసి తమ ఉనికిని కోల్పోతున్నారు.
ఇటువంటి సందర్భంలో ఇలా ఒక చదువుకున్న వ్యక్తి, యువకుడు ఈ అన్నలకి చేరువవ్వడం వింత కాకపోయినా తప్పుడు నిర్ణయమే అవుతుంది. ఇది పూర్తిగా అతని వ్యక్తిగతమే అయినా తను ఎంచుకున్న మార్గం మాత్రం ప్రజలకోసమే అని మనం నమ్మాలి. నేడు ఈ వ్యవస్తలో ఉన్న అనేకానేక రాజకీయ పక్షాల నాయకులు, కార్యకర్తలు చేయలేని సాహసం, తెగువ చూపి ప్రజలకోసం చివరికి ప్రాణాలు అర్పించాడు.
ఇప్పుడున్న నాయలుకుల పిల్లలు ఎందుకు చేయరు అనేది పూర్తిగా అసంబద్దమైన వాదన. ఎందుకంటె ఒక సిద్దాంతానికి కట్టుబడడం, ఫాలో అవ్వడం అనేది ఆ వ్యక్తీ యొక్క సొంత నిర్ణయం. అది పూర్తిగా వ్యక్తిగతం. ఈ ప్రపంచంలో ఉన్న అనేకానేక రుగ్మతలు నిత్యం ప్రజలని తప్పుదారి పట్టిస్తుంటాయి. యెంత కాదన్నా నేడు ఇలా ప్రాణాలు అర్పించేవారి మూలాలు తమ తమ పూర్వికులనుండి పొందిన స్పూర్తి చాలా వుంటుంది. అంటే నేడు ఉన్న కమ్యునిస్ట్ ల కుటుంబాల లో నుండే ఎక్కువగా రేపటి తరం వస్తుంది. కొత్తగా వచ్చి సిద్దాంతాన్ని అర్ధంచేసుకొనే వాళ్ళ కన్నా ఇలా తరాలుగా కమ్యునిస్ట్ కుటుంబాలలోనుండి వచ్చేవాల్లె ఎక్కువ వుంటారు. ఆ విషయాన్ని మరిచి కేవలం కొంతమంది అగ్ర నాయకుల పిల్లలు ఎందుకు రారు అనే ప్రశ్న వేస్తె మీకు ఈ సిద్దాంతం మీద అవగాహన రాహిత్యాన్ని మాత్రమె తెలియజేస్తుంది. ఇక్కడ పూర్తిగా వ్యక్తిగత స్వేఛ్చ వుంటుంది. ఈ దారిలో వుండే ముళ్ళని వివేక్ కి కూడా తల్లిదండ్రులో లేదా పరిచయం వున్నా నాయకులో చెప్పే వుంటారు. దానికి సిద్దపడి వచ్చినవాళ్ళే వస్తారు. బలవంతంగా వుంచడం, చేర్పించుకోవడం ఇక్కడ జరగదు, సాద్యం కూడా కాదు అనేది తెలుసుకోవాలి. ఎందుకంటె ఎంతోమంది లొంగిపోయిన వ్యక్తులు నేడు స్వేచ్చగా ఉండడానికి కారణం కూడా ఎవరి బలవంతం లేకపోవడమే.
ప్రజల బాగుకోసం ఏర్పడే ప్రభుత్వాలు అవి చేయనప్పుడు, వాటిని చూస్తూ ప్రజలు ఊరుకుంటుంటే ప్రజల్లో చైతన్యం నింపడం కోసం ప్రజలకోసం ప్రాణాలు అర్పించడానికి అయినా సిద్దపడే ఇలాంటి వివేక్ లు పుట్టుకొస్తూనే వుంటారు.
అతడిని గొప్పవాడిగా చూడకపోయినా పర్లేదు - విమర్శించే హక్కు ఇక్కడ ఎవ్వడికీ లేదు... నిజంగా ఎవ్వడికీ లేదు. ఒకవేళ మీకు వుంటే అందుకు తగిన ఆధారాలతో కామెంట్ చేయండి.

Saturday, June 13, 2015

వంతెనలు - రోడ్డు ప్రమాదాలు


Dhavaleswaram Barrage 
Prakasham Barrage
ఇంత ఆధునిక సమాజం లో బతుకుతున్నా ఇంకా రోడ్ ప్రమాదాల్లో ప్రాణాలను పోగొట్టుకోవడం చాలా విచారకరం. అందులోను ఇలాంటి ఘోర దుర్గటనలు అందర్నీ కలచివేస్తాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి. మనం చిన్న విషయాలే వదిలేసేవి ఒక్కోసారి ఘోర ప్రమాదాలకి కారణాలు అవుతాయి.
ఈరోజు ధవళేస్వరం వంతెన మీద నుండి పడిపోయి చనిపోయిన 22 మంది కూడా మనలాగే రేపటి భవిస్యత్తు గురించి ఆలోచిస్తూ వుంటారు. కారులో ఎన్నో సరదాలు తీర్చుకుంటూ, జోక్స్ వేసుకుంటూ, చిన్న చిన్న కోప తాపాలతో సంతోషంగా ప్రయాణిస్తూ ఉండి వుంటారు. వాళ్లకి తెలిసి చేసినా తెలియక చేసిన చిన్న పొరపాట్లే వారి ప్రాణాల్ని బలిగొని వుంటాయి.  అలాగే ఈ క్షణం రోడ్ మీద కుటుంబాలతో కలిసి తిరుగుతున్న లక్షలాది వాహనాల పరిస్తితి ఏంటి. వాటన్ని టికీ భద్రత ఎక్కడ. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలీదు.


అపరిచితుడు సినిమాలో చెప్పినట్టు ప్రతి చోటా నిర్లక్ష్యం. రోడ్ వేయడంలో నిర్లక్షం, గుంటలు పడితే పూడ్చడంలో నిర్లక్ష్యం, సరైన సూచనలు చేసే బోర్డ్ లు అమర్చడంలో నిర్లక్ష్యం. డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వడంలో నిర్లక్ష్యం. ఇచ్చినవాడు తాగి నడుపుతున్నాడో లేదో తెలుసుకోడంలో నిర్లక్ష్యం.  అంతా లంచాల మాయం. వ్యవస్తలు అన్నీ సక్రమంగా పనిచేస్తే ఇంతటి ఘోరాలు జరగవు అనేది సత్యం.

సాధారణంగా వంతెనల మీద రోడ్స్ వేయడంలో విపరీతమైన నిర్లక్ష్యం కనపడుతుంది. దానికి కారణాలు చాలా ఉండొచ్చు. జిల్లాల సరి హద్దులు, వంతెన స్తితిగతులు, రోడ్ మీద మల్లి రోడ్ వేసే పరిస్తితి లేకపోవడం ఇలా చాలా కారణాలు మనకి కనపడతాయి. అదే సమయంలో పరిష్కారాలు కూడా కనిపిస్తాయి. కేవలం సమస్యలని చూసి అలాగే వదిలేయకుండా కనీసం ఆ దారులు మూసివేయడమైనా చేయాలి. ఏదీ కాకుండా ప్రజల ప్రాణాలను గాల్లో వదిలేయడం అనేది క్షమించరాని నేరం. కొవ్వూరు వంతెన మీద ఒకసారి ప్రయానించాను. యెంత ఘోరం అంటే దాదాపు అడుగు లోతు గుంటలు వున్నాయ్. ఆ దారిలో ప్రయాణించడం అంటే ప్రాణాలు గాల్లో వదిలేయడమే అనిపించుంది. ఇప్పుడేమన్నా బాగుపడినదో లేదో తెలీదు. విజయవాడ ప్రక్షం బారేజి పరిస్తితికూడా అలాగే వుండేది. పెద్ద పెద్ద గుంటలతో. ఈ మధ్యే కాస్త రోడ్ వేసారు. వేసిన ఆరు నెలలకే మాల్లి అక్కడక్కడ గుంటలు పడ్డాయ్. ఫుట్ పాత్ ఇప్పటికీ ప్రమాదకరంగా నే వుంది.

అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
1. చాలా దేశాల్లో రోడ్ కి ఏవిధమైన గుంట పడినా అధికారులు అక్కడికి  12 గంటలల్లోపు చేరుకోవాలి. 24 గంటల్లోపు అక్కడ ఆ గుంతని పూడ్చేయాలి. అలాంటి సిస్టం మనం కూడా అమలు చేయాలి.
2. లైసెన్సు జారి చేసే విధానం పూర్తిగా మారిపోవాలి. సొంత డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటు చేసి అందులో కొన్ని దశల్లో డ్రైవర్ యొక్క సామర్ధ్యాన్ని పరీక్షించే పూర్తిగా శిక్షణ తీసుకున్న తరువాతే లైసెన్సు జారి చేయాలి.
3. ప్రతి 10, 15 కిలోమీటర్ కి ఒక చెక్ పాయింట్ ఏర్పాటు జరగాలి. ప్రతి వాహనం యొక్క కదలికలు వారి నేచర్ మొత్తం రికార్డెడ్ గా వుండాలి. ఇది ప్రమాదాలను నివారించడానికే కాకుండా ఇంకా అనేక విషయాల్లో ఉపయోగ పడుతుంది. ఇప్పుడు వేసే రోడ్స్ అన్ని PPP పద్దతే కనుక టెండర ఇచ్చే సమయంలోనే ఇలాంటి నిభందన అమలు చేయొచ్చు.
4. నిభందనలని పారదర్సాకంగా అమలు చేయాలి.

5. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని శాస్త్రీయంగా అద్యయనం  చేసే వ్యవస్త, సత్వరమే తగు చర్యలు తీసుకొనే అధికారాలు వుండాలి.
6. వాహనాలకి అనుమతులు ఇచ్చే సమయంలో వాటిని వివిధరకాలుగా పరీక్షించాలి. ఈ తుఫాన్ అనే వాహనాలు తరచుగా ప్రమాదాలకి కారణాలు అవుతున్నాయి. అలాంటి వాహనాలని శాస్త్రీయంగా అద్యయనం చేసి కంపెనీలకి సూచనలు ఇచ్చి తగు మార్పులు చేయించాలి.
7. జరిమానాలతో సరిపెట్టకుండా సరైన నిర్ణయాలు తీసుకొని వాహన దారులకి అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలి. ముక్యంగా తప్పు చేసి దొరికిన వాహన దారులని వదిలి పెట్టకుండా వాళ్ళు మల్లి ఆ తప్పు చేయని విధంగా కౌన్సెలింగ్ ఇప్పించాలి.

ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
1. తాము వాహనాన్ని నడిపేందుకు పూర్తిగా సిద్దంగా వున్నామా లేదా అని తమకి తాము పరీక్షున్చుకోవాలి.
2. ఒకవేళ డ్రైవర్ వుంటే అతని పరిస్తితిని అడిగి తెలుసుకోవాలి. సాధారణంగా ప్రతి 2 గంటల ప్రయాణానికి ఒక 5, 10 నిమిషాలు గాప్ తీసుకుంటూ వెళ్ళడం మంచిది. అదికూడా ఒకరోజులో గరిష్టంగా 8 నుండి 10 గంటల ప్రయాణం మాత్రమె చేస్తే ఎటువంటి అలసటా వుండదు.
3. ముక్యంగా తెల్లవారు జాము 1 నుండి 6 గంటల మద్య వాహనాలు నడపడం మంచిది కాదు. పూర్తిగా ఈ సమయాన్ని తప్పించి డ్రైవింగ్ ప్లాన్ చేసుకోవడం మంచిది.
4. యెంత అనుభావగ్నుడైనా ఒక్కోసారి ప్రమాదం జరగోచ్చు కనుక డ్రైవింగ్ లో ఎప్పుడూ భావోద్వేగాల్ని నియంత్రించుకోవాలి. ఆకతాయి తనం పనికిరాదు. మనకి ప్రమాదం జరక్క పోయినా మన ఆకతాయి తనం వాళ్ళ ఇతరులకి ప్రమాదం జరగోచ్చు.
5. నడిపే వాహనం యొక్క కండిషన్ తప్పక చెక్ చేసుకోవాలి. ముక్యంగా బ్రేక్, టైర్స్ అండ్ లైట్స్ వంటి ముక్యమైనవి కండిషన్ లో ఉండేలా చూసుకోవాలి.
6. అధికారులు గాని ప్రభుత్వాలు గాని డ్రైవింగ్ సూచనలు చేసేది మన మంచికే అని గ్రహించి వాటికి తగినట్టు నడుచుకోవాలి. లేదంటే ప్రమాదం జరిగేందుకు మనకి మనమే దగ్గరవుతున్నట్టు.
7. బండికి నిర్దేశించిన వ్యక్తుల కన్నా ఎక్కువమంది బండి లో ప్రాయానిస్తే అదుపుతప్పే ప్రమాదం వుంది. కనుక ఏ ఒక్కరో అయితే పర్లేదు గాని మరీ రెట్టింపు మంది ప్రయాణించడం మానుకోవాలి. బడ్జెట్ గురించి ఆలోచిస్తే ప్రాణాల మీదకి తెచ్చుకోవడమే. 

Monday, June 8, 2015

::: చంద్రబాబు ఓటుకి నోటు :::

మన రాజకీయ వ్యవస్తలో ఇలాంటి విషయాలు సర్వ సాధారనమైపోయాయి. మనం రాసుకున్న రాజ్యాంగం, పీనల్ కోడ్స్ అందరూ మర్చిపోయి ఇవి సాధారణ విషయాలుగా పరిగణించే స్తాయికి వ్యవస్తలు నాశనం అయ్యాయి. కెసిఆర్ కావాలని చేసినా లేక ఇంకే ఉద్దేశంతో చేసినా అది అప్రస్తుతం. చేసింది నేరం. ఇక దానికి కారణాలు వెతకడం దండగ. ఈ విషయాన్ని బేస్ చేసుకొని రెండు రాష్ట్రాల మద్య చిచ్చు పెట్టేలా వ్యవహరించడం ఇక చంద్రబాబు అండ్ కో ఆపేసి కాస్త విజ్ఞతతో ఆలోచించాలి. 
అస్సలు ఈ సంభాషణ టాప్ ద్వారా జరిగింది కాదు. ఇది స్టీఫెన్ తన మొబైల్ లో రికార్డు చేసింది కావచ్చు లేదా చంద్రబాబు PA (బాస్ మాట్లాడతారు అన్న వ్యక్తి) రికార్డు చేసింది కావచ్చు. ఎందుకంటె టాప్ చేస్తే ఫోన్ రింగ్ రికార్డు అవ్వడం జరగదు. కాబట్టి  టాపింగ్ జరిగింది అని మీరు ఇప్పటికిప్పుడు నిరూపించలేరు. ఒకవేళ ఇంకేమైనా రికార్డ్స్ కెసిఆర్ బయటపెడితే తప్ప.
  

అలాగే ఒక ముఖ్యమంత్రి ఫోన్ టాప్ చేయడం తప్పు అనే ముందు మీరు వాళ్ళ శాసనసభ్యుడిని  కొనాలని చూడడం తప్పు కాదా అని ఆలోచించండి. అలాగే ఒక పార్టీ నుండి ఇంకో పార్టీలోకి జంప్ చేసే సమయంలో ఇచ్చే నజరానాలను దీనితో పోల్చవద్దు. ఎందుకంటె ఇది పార్టీ మారేందుకు ఇచ్చింది కాదు. ఇది వోటు వెయ్యడానికి ప్రలోభపెట్టే కేసు. కనుక మీరు మీ వాదనలన్నిటినీ పక్కన పెట్టడం మంచిది. అస్సలు ఎలెక్షన్ కమిషన్ సుమోటో గా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్ధం కాదు. ఒకవేళ కెసిఆర్ గాని లేదా స్టీఫెన్ గాని ఎలక్షన్ కమిషన్ కి పిర్యాదు చేస్తే మీ బతుకేమిటో ఆలోచించండి. ఇది acb కేసు మాత్రమె అయితే మీవాళ్ళు కొంత బయట పడినట్లే. 

అలాగే ఇన్నాళ్ళు అవినీతి అవినీతి అని కారుకూతలు కోసిన మీ పార్టీ ముదురు నాయకులు యనమల, పరకాల ఇప్పుడు మీకు వంత పాడడం చూస్తుంటే అవినీతి, దొంగతనం హత్యా రాజకీయాలు లాంటివన్నీ చేయడానికి రాష్ట్రంలో మీ పార్టీ వాళ్లకి మాత్రమె రైట్స్ వున్నట్టు వ్యవహరించడం సిగ్గుపడాల్సిన విషయం. 

అలాగే రేపు రేవంత్ అప్రూవర్ గా మారితే అతని ప్రాణానికి లేదా స్టీఫెన్ ప్రాణానికి యెంత అపాయముందో కూడా ప్రజలకి తెలుసు. ఈ మురికిని ఎదుర్కొనే సత్తా ప్రస్తుతానికి తెదేపాకి లేదు. కాని ఏమైనా జరగోచ్చు ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టే ఒక ప్రణాళిక తో ముందుకెళ్తే కెసిఆర్ కాస్త వెనకడుగు వేయొచ్చు. కాని అది ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీ తాట తీసేస్తారు. 
ఇక పొతే ఇదేదో రెండు ప్రభుత్వాల మద్య నీటి గొడవలా ఆంధ్ర అధికారులు తలదూర్చడం మరీ సిగ్గుచేటు. ఆంధ్ర పోలీసులకి లేదా బ్యురోక్రాట్స్ కి తెలియదా ఇది యెంత పెద్ద నేరమో. దాన్ని కప్పిపుచ్చడానికి మల్లి మీరు పావులుగా మారకండి. అది మీ మెడకి చుట్టుకొని చివరికి శ్రీలక్ష్మి లా అయిపోతారు.  
విశేషమేమంటే మీరు పాలించినా, దొంగలై దొరికినా ప్రజల ఆస్తులకే పెద్ద బొక్క. కానివ్వండి ప్రజలు ఎన్నాళ్ళో చూస్తూ ఊరుకోరు. తిరగబడే రోజు వస్తుంది.
ఇలాంటి సందర్భం వచ్చినప్పుడైనా ప్రజల్లో కాస్త చైతన్యం వచ్చి ఆలోచిస్తారేమో చూడాలి. నాయకుల్లో భయం మాత్రం పెరిగింది. ఇకనైనా ఇలాంటి చర్యలు తగ్గుతాయి అని ఆశిద్దాం.

Thursday, June 4, 2015

::: రేవంత్ రెడ్డి :::

"చంద్రబాబు సొంత ఆస్తులమ్మి రుణమాఫీ చేయడు, ఏ నాయకుడు తన సొంత ఆస్తి అమ్మి ప్రజలకి ఏమీ చేయడు" ప్రజలు రుణమాఫీ అంటేనే ఓట్లు వేసారు. లేదంటే వేసేవాళ్ళు కాదు. ప్రజల్ని అబద్దాలతో అయినా నమ్మిన్చినోడికే ఒట్లేస్తారు. అందుకే నమ్మిన్చాం" 

ఈ మాటలు ఒక సంధర్బంలో రేవంత్ రెడ్డి అన్నవే. కొన్ని నిజాలని ధైర్యంగా చెప్పగలగడం వల్ల వున్నోల్లలో కాస్త మంచివాడు అనిపించాడు నాకు. తెదేపా లో కాస్త నచ్చే నాయకుడు. ముక్యంగా తెలంగాణా తెదేపా లో ఇంతకూ మించి ప్రస్తుతం ఎవరూ లేకపోవడం కూడా అందుకుకారణం కావచ్చు.
ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూ లో చాలా విషయాలు నిర్మొహమాటంగా చెప్పాడు. దేశంలో అవినీతి గురించి రాజకీయపార్టీ నాయకులు చేసే పనులగురించి కూడా. కాని ఇప్పుడిలా తనే ఇలా బలిపశువు అవుతాడు అనుకోలేదు.
-----------------------------------------------------------------------------
        అందరి టార్గెట్ ఒకటే అయినప్పుడు ఇలాంటివి జరుగుతాయ్...
----------------------------------------------------------------------------
సొంతపార్టీలో ఎర్రబెల్లి...
తెలంగాణా అధికార పార్టీలో అందరికీ కొరకరాని కొయ్య...
జగన్ కి కూడా మంచిదే (తన అవినీతిని ప్రజలు మర్చిపోతారు)
అటు కాంగ్రెస్ పార్టీ లో సొంత మనిషి జై పాల్ రెడ్డి...
ఇటు సొంత పార్టీలో తెలంగాణా అద్యక్షుడు అవుతాడేమో అని భయపడేవాళ్ళు...
ముందు ముందు కుమారుడికి అడ్డురావోచ్చేమో అనే భయం కూడా కావచ్చు...
ఇలాంటి  కారణాలు అన్ని కలిపి మొత్తంగా రేవంత్ ని ఒంటరివాడిని చేసి భలే ఇరికించారు. రేవంత్ స్తానంలో ఏ చినబాబో  వుంటే పరిస్తితి ఇలా వుండేది కాదు. 

అవినీతికి వ్యతిరేకంగా చూస్తె ఇలా జరగడం మంచిదే కాని ఇలాంటి కార్పొరేట్ పార్టీలో ఉంటూ కాస్తో కూస్తో నిజాయితీ గా వ్యవహరించే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళే ముందుగా బుక్ అవ్వడం కాస్త ఇబ్బందికరమైన పరిస్తితే
తెలంగాణా రాష్ట్రసమితి పార్టీలో కి ఎంతమంది వెళ్ళలేదు, కాంగ్రెస్ లోకి తెరాస నుండి ఎంతమంది పోలేదు, నాడు ycp లోకి పెద్ద పెద్ద నాయకులే పోయారు. కాంగ్రెస్ నుండి తెదేపా లోకి ఎంతమంది, కమ్యూనిస్ట్ పార్టీల నుండి ఎంతమంది  వెళ్ళలేదు.  ఇవన్నీ డబ్బు ప్రమేయం లేకుండా జరిగాయా? కాదుగా? ఇప్పుడు కూడా రేవంత్ ని పట్టించిన వ్యక్తికి అంతకన్నా ఎక్కువ డబ్బే ముట్ట చెప్పివుంటారు. అలాగే ఈ శాసనమండలి ఎలెక్షన్లు ఎప్పుడూ ఇలా అమ్ముడుపోవడానికి కొనుక్కోవడానికి వెసులుబాటుగా వున్తున్నాయ్. అసలు అంతా డబ్బే లోకంగా నడుస్తున్న పార్టీలలో ఇలాంటివి చాలా చాలా సహజం. కాని ఒకర్ని టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కావచ్చు. అది కూడా రేవంత్ కావడం కాస్త నన్ను ఫీల్ అయ్యేలా చేసింది. దానికి కారణం ముందే చెప్పాను. కేవలం అతని ఐడియాలజీ మాత్రమె
అలా అని అతికోక్కడికే నేను అవినీతి చేసుకొనే రైట్స్ ఇచ్చినట్టు కాదు. అతని ఐడియాలజీ బావుంటుంది. జనాలు ఇలాగే ఉండ మంటున్నారు. నిజాయితీగా ఉండే వాళ్లకి ఒత్లేస్తున్నారా... అని ప్రశ్నించే స్వభావం తనది. నిజమే నాయకుడిగా ఎదుగుదాం అనుకొనే ఒక  టార్గెట్ ఉన్న వ్యక్తీ చేయాల్సినవి ఇలాంటివేగా... ప్రజలు ఇలాగే వున్దమన్తున్నారు. ప్రజలు నాయకుల అవినీతిని చాలా లైట్ తీసుకుంటున్నారు. లేకపోతె జగన్ లాంటి అవినీతి ఆరోపణలు వున్నా వ్యక్తీని ఎలా ప్రతిపక్ష నాయకుడిని చేస్తారు.
ప్రజలు అవినీతి పరుడ్ని నాయకుడిని చేస్తుంటే, నాయకుడు కావాలి అనుకున్నోడు నిజాయితీగా ఎలా ఉండగలడు. అలా వుండే తత్వం అందరికీ వుండదు. వెసులుబాటు కూడా వుండదు ఉన్నా మిడిల్ డ్రాప్స్ చాలా ఉంటాయ్. ఈ సొసైటీ అలాగ చేయమంటుంది.
ఇప్పుడు కెసిఆర్ చేసిన పని బావుంది. అలాగే తన పార్టీలోకి వచ్చినప్పుడు తలసానికి, కడియంకి ఎంతిచ్చాడో కూడా చెప్తే బావుంటుంది. అప్పుడు అనగలం కెసిఆర్ మంచి నిజాయితీ పరుడు అని. నెత్తిన పెట్టుకోనేవాళ్ళం. కాని అలా జరగదే. తన అధికారం లో వున్నా పార్టీ లకి ఈ వెసులుబాటు వుంటుంది. ఇప్పుడు కెసిఆర్ కి వుంది. భవిస్యత్తు లో ఇలాంటివి కెసిఆర్ కి కూడా ఎదురు కావచ్చు. తానెంత నిజాయితీ పరుడో ముందుముందు తెలుస్తుంది. కాని కెసిఆర్ ని మెచ్చుకొని తీరాలి. ఇలాంటి ఒక ఆతని మొదలు పెట్టినందుకు. ఎందుకంటె ఈ ఆట మొత్తం రాజకీయ పార్టీల  మొత్తాన్ని ఆలోచనలో పడేస్తుంది. అలాగే ప్రజల్ని కూడా. 
ఇది మంచిదే, ఇలాగే జరగాలి. కాని రేవంత్ లాంటి కాస్తో కూస్తో మంచి ఐడియాలజీ  వున్నా నాయకుడితో స్టార్ట్ అవ్వడం ఇబ్బంది గా వుంది.

Thursday, May 28, 2015

::: మా జామచెట్టు vs రాజధాని :::

::: మా జామచెట్టు vs రాజధాని  :::



మా జామచెట్టు. మా తాత వేసిన చెట్టు. కాయల సైజు చిన్నగా ఉంటాయ్. కాని లోపల అంతా పింక్ కలర్ లో చాలా అందంగా, తియ్యగా ఉంటాయ్. ఊళ్ళో ప్రతి పిల్లోడికీ దానిమీదే చూపు. రెండు తరాలం ఎంతో ఇష్టంగా ఆ చెట్టు కాయలు తింటూనే వున్నాం. ఇప్పుడది ఒక జ్ఞాపకం కాబోతుంది.  అలాగే దారిపొడవునా రేగిచేట్లు చేయి చాచి కోసుకొని తినేంత దగ్గరలో. తాటికాయలు, ఈతకాలు. పచ్చని పైరుల మద్య అరుగులు. ఇంకా ఎప్పటికీ  ఆ మధురమైన భావనలు మా జ్ఞాపకాల్లోనే. ఇలాంటి వాటికోసమే సెలవోస్తే ఎక్కడెక్కడో  ఉద్యోగాలు చేసుకొనే వాళ్ళు తమ ఊళ్ళకి వెళ్ళేది. అలాంటి ఆటవిడుపు గ్రామాలు మా పొలాలు ఇక జ్ఞాపకాలే.




ఎందుకంటె మాకు రాజధాని వచ్చింది. ఒక పక్క సంతోషం. మొరోపక్క ముల్లులా గుచ్చుకొనే వాస్తవాలు, జ్ఞాపకాలు. నాలాగే చాలామంది ఇప్పుడున్న మంచి జీవితాన్ని, వాతావరణాన్ని, జ్ఞాపకాలని వదిలేసి మదిలో ఏవేవో కొత్త ఆశలతో రోజుల్ని భారంగా నేట్టేస్తున్నాం. తప్పదు.

కోట్లడబ్బు ఆనందాన్ని ఇస్తుంది అని ఏ కోటీశ్వరుడు చెప్పట్లేదు. కాని కోట్లవైపు మధ్యతరగతి చూస్తూ స్వత్చమైన ఆనందాన్ని ఇస్తున్న ఎన్నో జ్ఞాపకాలని పరిస్తితుల్ని వదిలి వెళ్తున్నాం.

కాని ఒక్కటి మాత్రం నిజం. ఇలాంటి పచ్చని పొలాలు ఇజ్రాయిల్ లాంటి దేశాల వాళ్లకి వుంటే వాళ్ళు ఈ పని చేయరు అని నమ్ముతా. ఎందుకంటె చుక్క నీటికోసం, ఒక మొక్క పెంచడం కోసం వాళ్ళు అక్కడ ఎంతకస్తాపడుతున్నారో ప్రపంచానికి తెలుసు. మనకి ఉండి నాశనం చేసుకుంటున్నాం. లేక వాళ్ళు కష్టపడుతునారు.

అలాగే మనం ఏం చేస్తున్నామో కూడా ఆలోచించు కోవాలి. ఇక్కడ రాజధాని వస్తుంది అని, అలాగే ఎక్కువ ధర వస్తుంది అని మనం మన భూములని స్వచ్చందంగా ఇచ్చినా ఆ వచ్చిన డబ్బుతో ఏం చేయాలి. ఈ మద్య కాలంలో భూమి విలువే అత్యంత వేగంగా పెరుగుతుంది. దానికి కారణం కూడా ప్రజలు, వాళ్ళ అవసరాలు పెరిగిపోవడం. అలాంటి భూమిని వదిలేసి, చిన్న స్తలం రాజధానిలో ఉన్నంత మాత్రాన ఏం ఉపయోగం. లేదా మల్లి ఎక్కడో ఒకచోట భూమిని కొనుక్కోవాలి. సరే కొనుక్కుంటాం కాని ఇక్కడున్నంత నీటి వసతి, భోగోలికంగా నష్టం చేయని వాతావరణం, అలవాటు పడ్డ వ్యవసాయం ఇవన్నీ ఉంటాయా. సరే వున్నా రేపు మల్లి ఏ సెజ్ కో అవి కూడా లాక్కోరు అని నమ్మగలమా.

నిర్మాణంలో ఉన్న ప్రకాశం బారేజి
మనం ఎంతో మందిని కాలి చేయించి ప్రకాశం బారేజి కట్టుకున్నది దేనికోసం, నీటి అవసరాలకి, వ్యవసాయానికి. ఇలా నీటిని ఒడిసిపట్టి సాగులోకి తెచ్చుకున్న సాగుభూములనే  నాశనం చేసి కట్టడాలు కట్టేందుకు ఉపయోగిస్తున్నారు అంటే యెంత అనాగరికమైన చర్యో అర్ధం చేసుకోవచ్చు. భూమికి మనం భారం కాకూడదు. ఎందుకంటె అది మనల్ని భారం అనుకుంటుంది తప్పకుండా.

అలాగే ఇప్పుడు 293 గ్రామాలలోని సుమారు 3 లక్షల మందిని వాళ్ళ గొడ్డు గోదాము, చెట్టు పుట్ట, ఇల్లు వాకిలి, పొలిమేర రాయిని, దేవుడి గుడిని అన్ని వదిలేసి పొండి అని నిర్దాక్షిణ్యంగా తరలిస్తున్నాం. పోలవరం ప్రాజెక్ట్ కట్టుకుంటున్నాం. దేనికి ?
సాగు భూమి కోసం. నీటి కోసం. పంటలు పండడం కోసం. బీడుగా ఉన్న నేలని సస్యస్యామలం చేయడం కోసం. నీరే మనకి ఆధారం. జీవి ప్రాణాలకి కావాల్సింది నీరే. ఆ నీటిని ఒడిసిపట్టి ప్రకాశం బారేజి కట్టి వాటర్ స్టోరేజ్ ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి నేల సారవంతమై 365 రోజులూ పచ్చగా ఉంటున్న ఆ నేల ఎన్ని కోట్ల విలువైనదో రైతు పుట్టుక పుట్టిన ప్రతివాడికి తెలుస్తుంది.
రేపు పోలవరం బ్యాక్ వాటర్లో నీలాగే ఇంకొకడు పొలాల్లో రాజధానొ లేక ఏ ఇండస్ట్రియల్ కారిడారో పెడతాను అంటే ఇప్పటి ప్రజల త్యాగాలకి విలువ ఉంటుందా.

అసలు నేలకి విలువ తనలో మొక్కలు పెరిగినప్పుడే. మొక్క మొలవని నేల ఎడారి అవుతుంది. దానికి విలువ వుండదు.
రైతుకి భూమి విలువ పెరగడం అంటే తనపోలం అన్నపూర్ణగా ఉన్నప్పుడే. "నీకేంట్రా సాంబయ్యా నీ పొలం మూడు పంటలు పండుద్ది నీకన్నా లచ్చాదికారి ఎవడ్రా వూళ్ళో" అంటుంటారు ఇప్పరికీ గ్రామాల్లో. ఇలాంటి అన్నపూర్ణగా ఉన్న నేల ఈ రెండు జిల్లాలలో ఇంకోచోట లేదు.
కాని అదే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి పైరు పెరగడం కన్నా దాని విలువ పెరగడమే ముక్యం.
రాజధానే కట్టాల్సివస్తే ఇప్పుడు అనుకొనే తుళ్ళూరు ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని 50 చదరపు కిలోమీటర్ల పరిదిలో ప్రభుత్వ భూమి కూడా దాదాపు 30 వేల ఎకరాలు ఉండొచ్చు. అంతకనా ఎక్కువే ఉండొచ్చు. అదీ పంటలు పండని భూమి. అలాంటి భూమిని ఉపయోగించి రాజధాని కట్టి దానికి విలువ పెంచితే చాలా చాలా బావుండేది. అది వదిలెసి ఏ రైతుకైనా అత్యంత విలువైన, సారవంతమైన నేలని అమ్ముకోండి, మాకిచ్చేయండి. వ్యవసాయం మానండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయండి అంటే అది సమర్ధనీయం కాదు. అంతగా వాస్తు అనుకుంటే వినుకొండ ఎలాగూ వుంది. అదీ కాక ఇదీ కాక పచ్చని పైరుల్లో కాంక్రీట్ పొద్దామనుకొనె ఈ చర్య దేశ సుభిక్షాన్ని కోరుకొనే వాడెవ్వడూ ఒప్పుకోడు.

ఎందుకంటె ఈ దేశం లో ఇలాంటి చర్యలే జరుగుతుంటే ఇంకొన్నాళ్ళకి అన్నపూర్ణగా ఉన్న మనదేశం అన్నమో రామచంద్రా అని ఇజ్రాయిల్ లాంటి దేశాలని అర్దిన్చాల్సివస్తుంది.

Wednesday, May 27, 2015

ప్రజారోగ్యం పట్టని పాలకులు


ఇవేమీ ప్రభుత్వాలో, వీల్లేమి అధికారులో అర్ధం కావడంలేదు...
ఫ్రూటి..... ప్రతి రుతువులోను మావిడి పళ్ళు అంట...
అందులో ఉండేవి మొత్తం కెమికల్స్.... అయినా మామిడికాయ జ్యూస్ అని ఆడ్స్...
పట్టించుకోనేవాడు లేడు...

కంప్లన్... ఇది తాగితే బాగా ఎదుగుతారు అంట...
అయితే నేను చూపించిన వాడికి తాగించి ఎదిగేలా చేయమనండి... అబ్బే అది కుదరదు...
ఆడ్స్ లో మాత్రం తాగితే చాలు చురుకుదనం వస్తుంది అంటారు...
పట్టించుకోనేవాడు లేడు...
సంతూర్ సోప్... వయసు కనపడదంట...
బామ్మలకి కూడానా...
తెలీదు పట్టించుకొనే వాడులేడు...
బూస్ట్ తాగితే ఎనర్జీ వస్తుందంట... ఎవడికో అర్ధం కాదు.
ఇవన్నీ కాక యేవో నాలుగు రసాలు కలిపి ఒక పదార్ధం తయారు చేసి గంటలు గంటలు టీవీల్లో ఊక దంపుడు ఆడ్స్.... వాటికి సెలబ్రిటీ లు ప్రమోటర్స్...
మన ఖర్మ.
అప్పుడెప్పుడో ఒక హెయిర్ ఆయిల్ వచ్చింది ఫుల్ పేజి యాడ్స్ తో...
న్యూ జెన్ హెర్బల్ హెయిర్ ఆయిల్... వాళ్ళ ఆడ్స్ ఎలా వున్నాయి అంటే శవానికి కూడా బట్టతలా పోగోడతాం అన్నట్టు ఇచ్చారు. బాగా కాసులు కురిపించుకున్నారు.
మన అమాయకత్వమే వాళ్ళ పెట్టుబడి.
అసలే సహజ సిద్దమైన ఆహారానికి దూరమై నిదానంగా 30, 40 ఏళ్ళకే ముసలోళ్ళ మాదిరి అయిపోతున్నాం... దానికి తోడు వీళ్ళు ఇచ్చే ప్రకటనల మోజులో పడి రోజు రసాయనాలు తాగుతూ ఉన్న కాస్త ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నాం.
అసలు వీటన్నిటికీ అనుమతి ఇచ్చే వాళ్ళని ఏంచేసినా తప్పులేదు.
మనం గుర్తించాల్సిన విషయం ఒకటుంది. ప్రజారోగ్య వ్యవస్త ఒకటి వుంది. పూర్తిగా ఆ వ్యవస్తని నిర్వీర్య పరిచిన మన పాలకులు ప్రజల ఆరోగ్యాన్ని, ఆయుష్షుని ఎప్పుడో తాకట్టు పెట్టారు. ఇది క్షమించరాని నేరం.

ప్రకటనల కోసం ఏ యాడ్స్ పడితే ఆ యాడ్స్ వేసే చానల్స్ ని కంట్రోల్ చేసే వ్యవస్త తక్షణ అవసరం.
యాడ్స్ రూపకల్పనలో కూడా ఎటువంటి అభూత కల్పనలు లేకుండా వాస్తవాలను చెప్పే ప్రయత్నం వుండాలి.
అలా లేని వాటిని అనుమతించని ఒక వ్యవస్త కావాలి.

యేవో నాలుగు రకాల చుక్కలు పెట్టి ప్రజల్ని మబ్యాపెట్టే ఆడ్స్ వేస్తూ చోద్యం చూస్తున్న ప్రభుత్వాల తీరు ఇక నైనా మారాలి. లేదంటే ఇప్పుడు ఎవ్వనస్తులతో నిండిన మన దేశం పూర్తిగా రోగిస్తులతో నిండడానికి ఎక్కువ కాలం పట్టదు..
కనీసం ఆహార సంబందిత ప్రొడక్ట్స్ మీద అన్నా ఖటిన మైన వ్యైఖరి అవలంబించని ప్రభుత్వాలు, అధికారులు, చానల్స్ లని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మనం మారితే వీళ్ళు మారతారు.
తినే, తాగే ప్రతి పదార్ధం సహజ సిద్దంగా వుండేది గా చూసుకోండి. లేదంటే మీ ఆరోగ్యం ఒక్కటే కాదు మీ ద్వారా మీ తరువాతి తరాలకి కూడా రోగ సంక్రమణ జరుగుతుంది.

మైల - మతం (పెద్దలకి మాత్రమె)


మైల అనగానే మనకి స్త్రీ నే గుర్తొస్తుంది. అనాదిగా మైల అనే పదాన్ని స్త్రీకే అంటగట్టాయి మన సంస్కృతులు మతాలూ. పిలుపులు వేరైనా దాదాపు అన్ని మతాలు మైలకి స్త్రీని మాత్రమె అర్హురాలిని చేసాయి.
హిందూ మతంలో అయ్యప్పమాలకి అలాగే కొన్ని కార్యాలకి దూరంగా ఉంచుతారు. అలాగే ముస్లిమ్స్ లో ఏకంగా మసీదులోకి స్త్రీ అడుగు పెట్టకుండా ఉండడానికి కారణంగా ఈ మైలనే ప్రధానంగా చెప్తారు.
రుతుక్రమంలో ఉన్న స్త్రీని ఆ మూడు లేక ఐదు రోజులు దూరంగా వుంచడం మతాలూ చేస్తున్నాయి. కొన్ని మతాలలో ఈ మైల వల్లే స్త్రీ చాలా వాటికి దూరంగా ఒక వివక్షని ఎదుర్కొంటుంది. స్త్రీకి ఆ సమయంలో విశ్రాంతి అవసరమే. అలా అని ఆ రుతుక్రమం వల్ల దేవుడికి అపచారం జరుగుతుంది అని, మనుషులకి రోగాలు వస్తాయి అని ఇంకా నమ్మడం మూర్కత్వం. 
స్త్రీని తాకకుండా, దూరంగా వెలివేయడం అన్నది తనపైన వత్తిడిని పెంచి ఇంకా ఆందోళనకి గురిచేసేది తప్ప తనకి స్వాంతన నిచ్చేది కాదు. పరిణామక్రమంలో గతంలో స్త్రీకి రుతుక్రమంలో లేని ఇబ్బందులు నేడు ఎక్కువగా ఉండడానికి ఈ మతాలూ అనుసరించే విధానాల వల్ల కలిగే వత్తిడి కూడా కారణమే.
మానవ పరిణామంలో పునరుత్పత్తికి ముక్యమైనది స్త్రీ యొక్క రుతుక్రమం. ఈ మైల అనేది స్త్రీకి లేకపోతె ఈ సృష్టిలో మానవుడి పునరుత్పత్తి సాద్యంకాదు. రుతుక్రమం అనేది లేకపోతె స్త్రీ గర్భదారణ సాద్యం కాదు. ఒక మగాడ్ని కనాలన్నా లేక స్త్రీని కనాలన్నా ఇప్పటి పరిణామాన్ని బట్టి స్త్రీకి రుతుక్రమం చాలా ముక్యం. అలాంటి ఒక మంచి పని స్త్రీ వల్ల, రుతుక్రమం వల్ల జరుగుతుంటే మగాడు మాత్రం తనకి నచ్చిన రీతిలో తనకి అవసరమైన రీతిలో అన్వయించుకొని తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇలాంటి చత్త సాప్రదాయాలను మతాల ముసుగులో భయపెడుతూ తమకి తామే ఏదో అపచారం చేసినట్టు వేలివేసుకోనేలా ఈ మతాలూ స్త్రీలని భయపెట్టాయి.
అసలు ఒక స్త్రీ మైలలో నుండి పుట్టిన బిడ్డకి అంటని మైల స్త్రీకి మాత్రమె ఎలా వుంటుంది. ఒక స్త్రీ మైలపడింది అనాలి అంటే అంతకన్నా ముందే ఈ సృష్టిలోని ప్రతి మనిషి మైల పడే వున్నాడు అని ఒప్పుకోవాలి. అలాంటప్పుడు స్త్రీని మైల పేరుతొ అణచాలి అని చూస్తున్న ఈ మత విశ్వాసాలని నిర్భయంగా ఎదుర్కోక తప్పదు.
ఒకనాడు మైల వల్ల రోగాలు వస్తాయి అని భయపడి ఉండవచ్చు. లేదా వచ్చి కూడా ఉండవచ్చు. కాని నేడు ఆ పరిస్తితి లేదు. స్త్రీ అన్ని పనులు ఆ ఐదు రోజులు కూడా చేసుకోగలుగుతుంది. ఉద్యోగం చేస్తుంది, వ్యాపరం చేస్తుంది, బడికెలుతుంది, ఆటలాడుకుంటుంది అలాగే అన్ని చేస్తుంది. దానికి తగిన మందులు అలాగే కొన్ని సౌకర్యాలు వచ్చాయి. కాని నేటికీ వివక్ష మాత్రం పోవడం లేదు.
ఒక స్త్రీకి మీరనే మైల.... ఈ స్తుష్టి కారకం. అంటే అది మీ పవిత్ర గ్రందాలకన్నా పవిత్రమైనదిగా చూడాల్సిన మతాలు కేవలం స్త్రీ కి మాత్రమె రావడం చేతనే మైల గా చేసేసారు.
ఓ పరిణామక్రమమా ఈ మైలని మగాళ్ళకి కూడా ఇవ్వాల్సింది. 
తప్పు చేసావ్...

Tuesday, May 26, 2015

డ్రాకులా జీవితం

అదేదో సినిమాలో సూర్యుడు ఉదయించే సమయానికి అప్పటి వరకు స్వేచ్చగా తిరుగుతున్న డ్రాకులాలు అన్నీ సూర్యుడి  వెలుతురు పడకుండా పారిపోతుంటాయి...గుర్తొచ్చిందా

త్వరలో మనపరిస్తితి కూడా ఖచ్చితంగా అంతే....
మనమే త్వరలో డ్రాకులాల జీవితం గడపబోతున్నాం...నో డౌట్...

ఉదయం సూర్యోదయం టైం కి ఇళ్ళలోకి జారుకుని a.c లు ఆన్ చేసి పనులు చేసుకుంటూ,
అన్ని షాపుల్లోనూ సెంట్రల్ a .c పెట్టుకుని పని చేసుకుంటూ
మల్లి సూరీడు అస్తమించేసమయానికి బయటకి రావడం...
అప్పుడు ఏదైనా బయట పనులుంటే చూసుకోవడం... 

ఈ లోపు బయటికి వచ్చామా  అంతే సంగతులు,  
ఇలా మాడి  మసై  పోవడమే... 
అదీ మన పరిస్తితి... బొత్తిగా డ్రాకులా జీవితం

డబ్బే జీవితం...

కొన్నాళ్ళ క్రితం వరకు అంటే సుమారుగా 25, 30 ఏళ్ళక్రితం వరకు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించిన వ్యక్తులను కలిస్తే చాలా విషయాలు చెప్పేవాళ్ళు. వాళ్ళ జీవిత సారం గురించి, వాళ్ళు తెలుసుకున్న విషయాల గురించి చాల విశేషాలు చెబుతారు.
కాని ఇప్పటి తరం వాళ్ళు ముసలోళ్ళు అయ్యాక తమ బిడ్డలకి నేర్పించే పాటం లేక వాళ్ళ జీవిత సారం గురించి చెప్పమంటే మొత్తం డబ్బు... డబ్బు... డబ్బు... డబ్బు... డబ్బు... డబ్బు... డబ్బు... డబ్బు
కేవలం డబ్బు గురించే మాత్రమె చెబుతారేమో...
ఎక్కడో ఒకరిద్దరు ప్రేమలగురించి చెబుతారు.... మిగతావేవి అసలు వుండవు.
డబ్బే నేటి ఆధునిక జీవన విధానం. మన గమ్యం... మన లోకం.... మన బ్రతుకికి అర్ధం...
తూ వెధవ జీవితం...
ఇలా అనుకున్నా మళ్ళీ తప్పదు డబ్బే జీవితం చేసుకోక...
తూ....తూ.... వెధవ జీవితం...


దేశ భక్తులు ఎవరు?

నాకర్ధం కాదూ...
ఒక సినిమాని పైరసి చేసినందుకు ప్రజలు, అభిమాలు చాలా బాధ పడుతున్నారు.
దానివల్ల వచ్చే నష్టం కేవలం ఒక 25 కోట్లు అనుకుందాం....
ఒక క్రికెట్ మ్యాచ్ లో ఓడిపోతే భాదపడుతున్నారు...
దానివల్ల వచ్చే నష్టం ఏమీలేదు... 

మరి వేలకోట్లు, లక్షల కోట్లు దొబ్బెసినోల్లని జనాలు ఇంత పిచ్చిగా అభిమానిస్తున్నారు ఎందుకో...
బహుశా ఒక సినిమాకి, ఒక హీరోకి, ఒక క్రికెట్ కి ఉన్నంత మంది అభిమానులు కూడా...
ఈదేశానికి లేరేమో... అనిపిస్తుంది. 


"ఆ ఒక్కటీ అడగొద్దు"

వద్దు "ఆ ఒక్కటీ అడగొద్దు"
నిజంగా చెబుతున్నాను... 
వద్దు మగాళ్ళని ఇలా అడగొద్దు... మేమింతే...
మా చిన్ననాటినుండి ఈ సమాజం మమ్మల్ని ఇలా ఉంటేనే మగాడివిరా నువ్వు అన్నారు... 
నేడు తప్పు... వద్దు అంటే మారలెం...

ఒక వ్యబిచారం కేసులో పట్టుబడ్డ యువతి ఇవ్వాల్సిన లంచం ఏంటో తెలుసా... 
మళ్ళీ వ్యబిచరించడం (బయటకు చెప్పలేని విషయాలు చాలా వున్నాయి)... 
ఇక్కడి ఇలాగే వుంటుంది ... ఇది మనదేశ సహజ లక్షణం...

మీరు ఇలా రోడ్డుమీదకి వస్తే మీకు సపోర్ట్ గా వచ్చే పురుషులలో ఎంతమంది మీ అందాల్ని చూడడానికి వస్తారో మీకు తెలియదు.... 
మేమింతే మగాళ్ళం... అలా చూడక పొతే సృష్టే నాసనమవుతుంది అని చెప్పగలిగిన ధీరులం... 
మాకస్సలు సిగ్గులేదు ఆ విషయంలో ...
ఈ ఫోటోలొ ఏ అమ్మాయి బాగుందా అని 90% మాగాల్లు వెతుకుతారు... 
మీకు తెలియదు... కాని నిజం...

మేమెంత గోప్పవాల్లమైనా,  రోజూ ఇది నేరం తప్పు అని చెప్పే వ్యక్తులమైనా, శిక్షలు వేసే వారమైనా ఇంకేవరిమైనా, 10 ఏళ్ళ పిల్లవాడినైనా 80 ఏళ్ళ వ్రుద్దులమైనా మేమింతే... మేము మగాళ్ళం... ఓ ఆధినిక పోర్న్ యానిమల్స్ మి...

ఒకవేళ మేమిలా లేకపోతె సాటి మగాళ్ళు హిజ్రాలుగా గేలి చేస్తారు అనే భయపడే వాళ్ళం... అవునండోయ్ శాఖీయ కణాలని ప్రతుత్పత్తి కణాలుగా చేయగలిగిన నాడు మీరు మామ్మల్ని హిజ్రాలుగానే మార్చేస్తారేమో... ఈ మోడరన్ యానిమల్స్ భాద భరించలేక...

తప్పుగా అనుకోవద్దు...
మీ ముందున్నది... మీ భందువయినా, వరుస ఏదైనా, చిన్నోడైనా, పెద్దోడయినా వాడు మగాడైతే చాలు... వాడినుండి మీకు అపాయం పొంచివున్నట్లే.... అందుకే
మీ రక్షణ ఏర్పాట్లు మీరు చేసుకోండి. మగాడు అవకాసం రానంతవరకూ శ్రీ రామచంద్రుడిలానే ఉంటాడు. అందుకే మీరు ఆ అవకాసం మగాడికి ఇవ్వకండి. మీ రక్షణ ఏర్పాట్లు మీరు చేసుకోండి.

నా ఫిక్షన్

రాత్రి ఒక కల వచ్చింది. సైన్స్ ఫిక్షన్.
సూర్యుడు అంతరించిపోతున్నాడు, ఇక భూమి కూడా అంతరించిపోబోతోంది. భూమి పరిబ్రమన ఆగిపోబోతోంది, అదే జరిగితే భూమి, భూమి పైన వున్నా సమస్త జీవరాసులు క్షణాలలో నాశనం అవ్వడం ఖాయం.
ఆ కలలో నాకు తోచిన ఆలోచన ప్రత్యామ్నాయం ఒకటుంది,
భూమిని మన గాలక్సీ లోని ఇంకొక హేల్ది సూర్యుని కక్ష్యలోకి ఇప్పుడున్న దూరంలో ప్రవేశ పెట్టడం. అలా ప్రవేశ పెట్టె సమయంలో భూమి మీద వాతావరణం మారకుండా చూడడం అలాగే భూమి పరిభ్రమణ కాలం మారకుండా చూడటం చాలా ముక్యం. కాని ఎలా, 
ఆలోచిస్తున్నాను...
ఇంతలో ఫోన్ మోగుతుంది మార్గదర్శి చిట్ ఏజెంట్ నుండి... నెలాఖరు కదా చిట్ డబ్బులకోసం... ఏంచేస్తాం, కల వద్దనుకొని జీవిత పోరాటం కోసం పొద్దున్నే లేవాల్సివచ్చింది...
అసలు శాస్త్ర విజ్ఞానం ఈ స్తాయిలో అభివృద్ధి చెందటం సాధ్యమేనా... ఈ భూమిమీద లేక ఈ విశ్వంలో ఎక్కడైనా ఇలా ఒక గ్రహ సోలార్ సిస్టం మార్చగలిగే టెక్నాలజీ, దానికి కావలసిన వనరులు ఉన్నాయంటారా...

ఈ క్రింది లింక్ కూడా చూడండి. మనకి తెలిసిన గెలాక్సీ ల వివరాలు ఉన్నాయి
http://en.wikipedia.org/wiki/List_of_galaxies












The Milky Way's Galactic Center in the night sky above Paranal Observatory
(the laser creates a guide-star for the telescope).
ఇది వికీపీడియా ఫోటో 

కొత్త పరిణామం

ఈ విశ్వం లో మనమొక అనామకులం అని అనుకోక తప్పదు (ఇప్పటివరకు). 
ఈ భూమి మీద జీవరాసి ఉండడానికి కారణం ఇక్కడున్న వాతావరణం. ఇలాంటి మరో భూమి మరోటి వుందో లేదో ఇప్పటికైతే కనుగొనబడలేదు. కాని వుండే అవకాసం వుంది. అదికనుగొనె లోపు ఈ భూమే అంతరించి పోవచ్చు.
2012 మూవీ లో చెప్పినట్లు కేవలం మానవ మనుగడే నాశనం అయితే పర్లేదు మనం అదే మూవీ లో చెప్పినట్లు మానవ మనుగడని కొనసాగించవచ్చు. కాని అలాకాకుండా ఈ భూమి పూర్తిగా అంతరించి పొతే జీవరాశిని కాపాడుకోవడం ఎలా. ఇప్పటివరకు భూమి మీద ఉన్నఅన్ని జీవరాసుల్లోకేల్లా మనిషే అత్యంత అభివృద్ధి చెందిన జీవి. ఆలోచనలో మనిషే అత్యున్నత జీవి.
కాబట్టి మనిషే మరో కొత్త ఎవల్యూషన్ కి బీజం వేసేలా అది మనం నిర్దేశించిన విధంగా ఎదిగేలా ఒక ప్రాజెక్ట్ చేపట్టాలి. అది ఎలా వుండాలి అంటే మనం ఎగ్రహం మీద అయినా మళ్ళీ మానవులు వుద్భవించెలా చేయగలిగిన ఎవల్యూషన్. ఏకకణ జీవినుండి మనిషి వరకు యెంత వీలయితే అంత తక్కువ కాలంలో తనకి అనువైన వాతావరణం రాగానే తనని తానూ సృస్తించుకొనే జీవరాసి యొక్క ప్రాధమిక కణాలను ఎగ్రహం మీద అయినా, ఎటువంటి వాతావరణం లోనైనా బద్రపరిచే ఒక వ్యవస్తని తయారుచేసుకోవాల్సిన ఆవశ్యకత వుంది. (ఇదంతా మనిషిగా ఇలాగే మనల్ని కాపాడుకోలేక పొతే చేయాల్సిన విషయం)
మనం సైన్స్ ని వుపయోగించి ఏ గ్రాహం మీద అయినా జీవరాసి ఉందేమో అని వెతుకులాడుతున్నాము. కాని మనం చేయాల్సిన పని ఇంకోటివుంది. మనకి అందుబాటులోవున్న ఏ గ్రాహం మీద అయినా పరిణామక్రమం జరిగే అవకాసం ఉన్న గ్రహం మీద కొన్ని ప్రాదమిక జీవ కణాలను దాచి వుంచడం, కుదిరితే అవి అక్కడి వాతావరణాన్ని తట్టుకొని ఎదిగేలా చేయడం. జీవరాసి ఎదగడానికి కావలసిన వాతావరణం కుత్రిమంగా ఎలా తయారుచేయాలో ఆలోచన చేయడం ... మొత్తంగా మనిషి తనని తానూ సృష్టించుకొనే ఒక ప్రాజెక్ట్ చేపట్టడం చాలాముక్యం....
ఎందుకంటె ఈ విశాల విశ్వంలో మనకి ఎప్పుడు ఎటునుండి ప్రమాదం పొంచివుందో చెప్పలేము.
నేనైతే ఈ వర్డ్స్ టైపు చేసి పోస్ట్ చేసే సమయంలోనే ఈ మొత్తం విశ్వం నాసనమైనా అవ్వొచ్చు అనుకొంటాను, ఎందుకంటె ఈ విశ్వం లో మనిషి తెలుసుకోవాల్సింది గూగుల్ కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో వుంది, ఎప్పుడు ఎటునుండి ప్రమాదం వస్తుందో తెలియదు కదా
మనకి అస్సలు టైం లేదు...
(ఇంకోటి ఈ పోస్టుకి ఈ ఇమేజ్ ఎందుకు పెట్టానంటే, సుమారుగా ఒక గంట వెదికాను ఈ పోస్టుకి సరిపోయే ఇమేజ్ కోసం, ఎందుకో నాకు ఇదే సరైనదేమో అనిపించింది. రెండు కణాల కలయికలా వుంది )
కొత్త 

:: ఒక కోడి కథ ::

ఎందుకో తెలియదు కాని ప్రతి ఆదివారం చాలా త్వరగా మెలకువ వస్తుంది... 
అలాగే ఈ ఆదివారం కూడా.
ఉదయాన్నే 5 :30 కే ...
ఏమిచేయాలో తెలియక, నిదుర పట్టక లేచి బండి తీసి హైవే ఎక్కాను, టీ తాగుదాం అని...
హైవే దాటి టీ కొట్టు కి చేరగానే వెనకాలే పెద్ద శబ్దం,
ఎమైందా అని వెనక్కి తిరిగి చూసాను..
వేగంగా వెళ్తున్న ఒక కోళ్ళు తరలించే ఆటో కనపడింది,
మరి శబ్దం ఏమిటా అనుకుటుంటే, అంతలోకే రోడ్ పైన కనిపించాయి కోళ్ళు,
ఆటో లోంచి కింద పడ్డాయి. పాపం వాటి కాళ్ళు ఒకదానికొకటి కట్టివేసి ఉన్నాయ్.
ఇంతలోనే ఒక లారీ వేగంగా వాటి పైనుంచి వెళ్ళింది....
పాపం అనిపించింది, కాని ఏం చేస్తాం... తరువాత ఇంకో లారీ... ఇలా అక్కడున్న కాసేపట్లో చాలా లారీలు...
చాల సేపు మౌనంగా వాటినే చూస్తూ అక్కడే ఉన్నాను.

ఈ రోజు కూడా అవే గుర్తుకు వస్తున్నాయి.
నాకనిపిస్తుంది
ఈ దేశం లో ఉన్న పేదవాడి పరిస్తితి కూడా ఇలాగే ఉంది అని.
పేదవాడు ఎప్పటికి ఒకడి కింద పనిచేయవలసిందేనా...బానిసలా...
ఒకవేళ అదృష్టం కలిసి వచ్చి ఈ కోళ్ల లాగ బానిస బ్రతుకు నుండి బయట పడినా...
వాడి కాళ్ళు కట్టేసి ఉంటాయి... ఎక్కడా ఒక్క అవకాసం లేక... సహకారం అందక.. పేదవాడు ఈ సమాజంలో ఎలా బ్రతకగలడు...
ఏదో ఒక రోజు ఈ కోళ్ల లా...చావడం తప్ప.
ఒకవేళ ఆ కోళ్ళు ఆటో నుండి బయట పడక పోయినా... మరి కొద్ది సేపటి తరువాత ఆ ఆటో వాడు ఎలాగు తీసుకెళ్ళి... కోసి... అమ్మేస్తాడు...
అలాగే పేదవాడు బానిస బ్రతుకునుండి బయటపడకపోతే అక్కడే వుండి చచ్చేదాకా ఊడిగం చేయవలసిందే...
ఏంటో ఈ జీవితాలు... మరీ ఫారం కోళ్ల మాదిరి....
(కొంతమంది కాళ్ళు కట్టివేయని కోళ్ల లా స్వేచ్చగా బ్రతికేస్తారులెండి)


నేటి సంస్కృతి


ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తీ ఎదుటి వ్యక్తీ యొక్క ఆలోచనలకు, నమ్మకాలకు విలువ ఇవ్వాలి... మనం మారుతున్నాం, మనల్ని మనం మార్చుకుంటున్నాం... కాదంటారా... కాని సంస్కృతీ పేరుతొ చేసే మూఢ విశ్వాసాలను వ్యతిరేకిస్తాం తప్ప...
అసలు ఏ సంస్కృతీ మంచిది కాదు... 
దాన్ని పాటిన్చవద్దు అని చెప్పడం తప్పు. 
మంచిని మంచిగా చూడటం... 
నిజాన్ని నిజాయితీగా ఒప్పుకోవడం చేయాలి... 
ఆధునిక శాస్త్ర సాకేతిక విజ్ఞానం ఇంత పెరుగుతున్నా,  మేము మా మూఢ విశ్వసాల్ని పాటిస్తాం అంటే ఎలా... 
మన నిన్నటి సంస్కృతి గొప్పదే అది నిన్నటికి.... నేటికి కాదు, ఎన్నటికీ కాబోదు.
పాత వాటిలోని మన మనుగడకి కావలసిన విషయాలను తీసుకొని ఎప్పటికప్పుడు మనల్ని మనం తప్పక మార్చుకోవాలి. 
ఇది నేటి సంస్కృతి...

నేనింకా...

సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు...
తుఫాను గొంతు చిత్తం అనడం జరగదు...
పర్వతం ఎవడికీ వంగి సలాం చెయ్యదు...
నేనింకా ఒక పిడికెడు మట్టినే కావచ్చు...
కాని నాకు ఒక దేశపు జెండాకున్నంత పోగరుంది.

                                                    - శేషేంద్ర