Humanity

Humanity

Thursday, June 4, 2015

::: రేవంత్ రెడ్డి :::

"చంద్రబాబు సొంత ఆస్తులమ్మి రుణమాఫీ చేయడు, ఏ నాయకుడు తన సొంత ఆస్తి అమ్మి ప్రజలకి ఏమీ చేయడు" ప్రజలు రుణమాఫీ అంటేనే ఓట్లు వేసారు. లేదంటే వేసేవాళ్ళు కాదు. ప్రజల్ని అబద్దాలతో అయినా నమ్మిన్చినోడికే ఒట్లేస్తారు. అందుకే నమ్మిన్చాం" 

ఈ మాటలు ఒక సంధర్బంలో రేవంత్ రెడ్డి అన్నవే. కొన్ని నిజాలని ధైర్యంగా చెప్పగలగడం వల్ల వున్నోల్లలో కాస్త మంచివాడు అనిపించాడు నాకు. తెదేపా లో కాస్త నచ్చే నాయకుడు. ముక్యంగా తెలంగాణా తెదేపా లో ఇంతకూ మించి ప్రస్తుతం ఎవరూ లేకపోవడం కూడా అందుకుకారణం కావచ్చు.
ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూ లో చాలా విషయాలు నిర్మొహమాటంగా చెప్పాడు. దేశంలో అవినీతి గురించి రాజకీయపార్టీ నాయకులు చేసే పనులగురించి కూడా. కాని ఇప్పుడిలా తనే ఇలా బలిపశువు అవుతాడు అనుకోలేదు.
-----------------------------------------------------------------------------
        అందరి టార్గెట్ ఒకటే అయినప్పుడు ఇలాంటివి జరుగుతాయ్...
----------------------------------------------------------------------------
సొంతపార్టీలో ఎర్రబెల్లి...
తెలంగాణా అధికార పార్టీలో అందరికీ కొరకరాని కొయ్య...
జగన్ కి కూడా మంచిదే (తన అవినీతిని ప్రజలు మర్చిపోతారు)
అటు కాంగ్రెస్ పార్టీ లో సొంత మనిషి జై పాల్ రెడ్డి...
ఇటు సొంత పార్టీలో తెలంగాణా అద్యక్షుడు అవుతాడేమో అని భయపడేవాళ్ళు...
ముందు ముందు కుమారుడికి అడ్డురావోచ్చేమో అనే భయం కూడా కావచ్చు...
ఇలాంటి  కారణాలు అన్ని కలిపి మొత్తంగా రేవంత్ ని ఒంటరివాడిని చేసి భలే ఇరికించారు. రేవంత్ స్తానంలో ఏ చినబాబో  వుంటే పరిస్తితి ఇలా వుండేది కాదు. 

అవినీతికి వ్యతిరేకంగా చూస్తె ఇలా జరగడం మంచిదే కాని ఇలాంటి కార్పొరేట్ పార్టీలో ఉంటూ కాస్తో కూస్తో నిజాయితీ గా వ్యవహరించే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళే ముందుగా బుక్ అవ్వడం కాస్త ఇబ్బందికరమైన పరిస్తితే
తెలంగాణా రాష్ట్రసమితి పార్టీలో కి ఎంతమంది వెళ్ళలేదు, కాంగ్రెస్ లోకి తెరాస నుండి ఎంతమంది పోలేదు, నాడు ycp లోకి పెద్ద పెద్ద నాయకులే పోయారు. కాంగ్రెస్ నుండి తెదేపా లోకి ఎంతమంది, కమ్యూనిస్ట్ పార్టీల నుండి ఎంతమంది  వెళ్ళలేదు.  ఇవన్నీ డబ్బు ప్రమేయం లేకుండా జరిగాయా? కాదుగా? ఇప్పుడు కూడా రేవంత్ ని పట్టించిన వ్యక్తికి అంతకన్నా ఎక్కువ డబ్బే ముట్ట చెప్పివుంటారు. అలాగే ఈ శాసనమండలి ఎలెక్షన్లు ఎప్పుడూ ఇలా అమ్ముడుపోవడానికి కొనుక్కోవడానికి వెసులుబాటుగా వున్తున్నాయ్. అసలు అంతా డబ్బే లోకంగా నడుస్తున్న పార్టీలలో ఇలాంటివి చాలా చాలా సహజం. కాని ఒకర్ని టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కావచ్చు. అది కూడా రేవంత్ కావడం కాస్త నన్ను ఫీల్ అయ్యేలా చేసింది. దానికి కారణం ముందే చెప్పాను. కేవలం అతని ఐడియాలజీ మాత్రమె
అలా అని అతికోక్కడికే నేను అవినీతి చేసుకొనే రైట్స్ ఇచ్చినట్టు కాదు. అతని ఐడియాలజీ బావుంటుంది. జనాలు ఇలాగే ఉండ మంటున్నారు. నిజాయితీగా ఉండే వాళ్లకి ఒత్లేస్తున్నారా... అని ప్రశ్నించే స్వభావం తనది. నిజమే నాయకుడిగా ఎదుగుదాం అనుకొనే ఒక  టార్గెట్ ఉన్న వ్యక్తీ చేయాల్సినవి ఇలాంటివేగా... ప్రజలు ఇలాగే వున్దమన్తున్నారు. ప్రజలు నాయకుల అవినీతిని చాలా లైట్ తీసుకుంటున్నారు. లేకపోతె జగన్ లాంటి అవినీతి ఆరోపణలు వున్నా వ్యక్తీని ఎలా ప్రతిపక్ష నాయకుడిని చేస్తారు.
ప్రజలు అవినీతి పరుడ్ని నాయకుడిని చేస్తుంటే, నాయకుడు కావాలి అనుకున్నోడు నిజాయితీగా ఎలా ఉండగలడు. అలా వుండే తత్వం అందరికీ వుండదు. వెసులుబాటు కూడా వుండదు ఉన్నా మిడిల్ డ్రాప్స్ చాలా ఉంటాయ్. ఈ సొసైటీ అలాగ చేయమంటుంది.
ఇప్పుడు కెసిఆర్ చేసిన పని బావుంది. అలాగే తన పార్టీలోకి వచ్చినప్పుడు తలసానికి, కడియంకి ఎంతిచ్చాడో కూడా చెప్తే బావుంటుంది. అప్పుడు అనగలం కెసిఆర్ మంచి నిజాయితీ పరుడు అని. నెత్తిన పెట్టుకోనేవాళ్ళం. కాని అలా జరగదే. తన అధికారం లో వున్నా పార్టీ లకి ఈ వెసులుబాటు వుంటుంది. ఇప్పుడు కెసిఆర్ కి వుంది. భవిస్యత్తు లో ఇలాంటివి కెసిఆర్ కి కూడా ఎదురు కావచ్చు. తానెంత నిజాయితీ పరుడో ముందుముందు తెలుస్తుంది. కాని కెసిఆర్ ని మెచ్చుకొని తీరాలి. ఇలాంటి ఒక ఆతని మొదలు పెట్టినందుకు. ఎందుకంటె ఈ ఆట మొత్తం రాజకీయ పార్టీల  మొత్తాన్ని ఆలోచనలో పడేస్తుంది. అలాగే ప్రజల్ని కూడా. 
ఇది మంచిదే, ఇలాగే జరగాలి. కాని రేవంత్ లాంటి కాస్తో కూస్తో మంచి ఐడియాలజీ  వున్నా నాయకుడితో స్టార్ట్ అవ్వడం ఇబ్బంది గా వుంది.

No comments:

Post a Comment